వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు పోలీసు స్టేషన్లో నాయి బ్రహ్మణ సంఘం నాయకులు రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు.
ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడారంటూ నాయి బ్రహ్మణ సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.నాయి బ్రహ్మణ సంఘం నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు.
నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు రాజోలు మండల నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు.తమను కించపరిచే విధంగా మాట్లాడిన ఆర్జీవీని వెంటనే అరెస్ట్ చేయాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.