ప్రస్తుత కాలంలో కొందరు మద్యం మత్తులో చేసేటువంటి పనుల కారణంగా చిన్న పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి.తాజాగా ఓ వ్యక్తి పీకల దాకా మద్యం సేవించి అభం, శుభం తెలియని 8 సంవత్సరాలు కలిగినటువంటి ఓ చిన్నారిపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే 8 సంవత్సరాలు కలిగినటువంటి ఓ చిన్నారి బాలిక తమ కుటుంబ సభ్యులతో ఢిల్లీ నగర పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.అయితే తాజాగా చిన్నారి బాలిక తన నానమ్మతో కలిసి రాత్రి సమయంలో ఇంటి బయట ఉన్నటువంటి అరుగు మీద పడుకుంది.
అయితే అదే ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి సదాము అనే వ్యక్తి అదే సమయంలో పీకల దాకా మద్యం సేవించి చిన్నారి బాలిక పై దారుణంగా అత్యాచారం చేశాడు.అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలికను చూసి చనిపోయిందని భయపడి అక్కడి నుండి పరారయ్యాడు.
అయితే చిన్నారి బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స కోసం దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించగా వైద్య చికిత్సలు నిర్వహించిన అనంతరం బాలికపై దారుణంగా అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్థారించారు.దీంతో వెంటనే బాలిక తల్లిదండ్రులు బాలికను వెంటబెట్టుకొని దగ్గర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి బాలిక పై జరిగినటువంటి అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.