గత కొద్ది కాలంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.ఇటీవలే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే సినీ పరిశ్రమలో బాలీవుడ్ యాక్షన్ దర్శకుడు మరణించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే బాలీవుడ్ లో పలు యాక్షన్ తరహా చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్ గా వ్యవహరించిన పర్వేజ్ ఖాన్ గత కొద్ది కాలంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నాడు. దీంతో ఈ మధ్య ఈ వ్యాధి తీవ్రత కారణంగా వచ్చేటువంటి గుండె నొప్పి మరింత ఎక్కువ కావడంతో ఇటీవలే ముంబైలో ఉన్నటువంటి ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు.
అయితే తాజాగా ఈ చాతిలో నొప్పి మరింత ఎక్కువగా రావడంతో తాళ లేక మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులకు తెలిపారు.దీంతో సినీ పరిశ్రమకు చెందిన కొందరు సినీ ప్రముఖులు మరియు సెలబ్రిటీలు పర్వేజ్ ఖాన్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
మరి కొంతమంది ఆయన అభిమానులు పర్వేజ్ ఖాన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేస్తున్నారు.
అయితే బాలీవుడ్ లో మంచి విజయం సాధించినటువంటి బద్లాపూర్, అంధాధున్, తదితర హిట్ చిత్రాలకు పర్వేజ్ ఖాన్ యాక్షన్ డైరెక్టర్ గా పని చేశాడు.
అయితే ఈ కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ లోడ్ కాలంలోనే ఎనిమిది మంది బాలీవుడ్ సినీ ప్రముఖులు మృతి చెందారు.