కొత్తగా పెళ్లి అయి ఉంటుంది ఆ యువతికి.ఎన్నో ఆశలతో కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంది.
కానీ, ఆమె జీవితం ఇలా మలుపు తిరగబోతుందని భావించి ఉండకపోవచ్చు.విధి ఆమెను వంచించింది.
గుర్తు తెలియని వాళ్లు ఆమెను అతి కిరాతకంగా చంపి సూట్ కేసులో కుక్కి వదిలేసి వెళ్లిపోయారు.పోలీసులు కూడా ఆమె ముఖాన్ని గుర్తించలేని పరిస్థితి.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.నవ వధువుని అతి కిరాతకంగా హత్య చేసి సూట్ కేసులో కుక్కి పడేశారు.నగర శివారులో అనుమానాస్పదంగా పడిఉన్న ఓ నల్ల బ్యాగును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సూట్ కేస్ ను ఓపెన్ చేశారు.
ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు.సూట్ కేసులో ఓ యువతి మృతదేహాన్ని చూసి ఆందోళన చెందారు.
సినిమాల్లో సైకోలు చేసే విధానంలా అన్నట్టు చంపారు.
మృతదేహాన్నిపోలీసులు పోస్టుమార్టంకు తరలించారు.
పోలీసులకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు.యువతికి సంబంధించి ఎలాంటి ఆధారం లేదు.
కాకపోతే ఆ యువతికి ఇటీవలే వివాహం జరిగినట్లు విచారణలో తేలింది.అవసరానికి పెళ్లి చేసుకుని అతి కిరాతంగా చంపి సూట్ కేసులో కుక్కేసి నగర శివారులో వదిలేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
అయితే ఆమె ఎవరు.ఎందుకు ఆమెను చంపాలనుకున్నారు.
పెళ్లి అయిన కొద్ది రోజుల్లోనే చంపడానికి కారణాలేంటి.సూట్ కేసులో కుక్కి మరీ నగర శివారులో వదిలేసి వెళ్లడం ఏంటనీ ప్రశ్నించుకుంటున్నారు.
ఇది సైకోల పనా లేక తెలిసిన వాళ్ల పనా అంటూ పోలీసులు ఆలోచనలో పడ్డారు.