ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో ఆ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అంటూ చేస్తున్నారు.చాలా మంది థ్రూ బ్యాక్ ఛాలెంజ్ లో భాగంగా వారి వారి పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు.
పాత ఫొటోలను షేర్ చేసి ఇతరులను ఛాలెంజ్ చేస్తున్నారు.తాజాగా సమంత పోస్ట్ చేసిన ఒక ఫొటో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇన్ స్టాగ్రామ్లో సమంత ఈ ఫొటోను షేర్ చేసింది.ఇందులో సమంత కాస్త శృతి మించినట్లుగానే అనిపిస్తుంది.
పెళ్లి అయిన హీరోయిన్ ఈ రేంజ్లో ఎక్స్ పోజింగ్ ఏంటో అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఫ్యాషన్ డిజైనర్ శిల్ప రెడ్డి ఛాలెంజ్ ను స్వీకరించి నేను డిఫరెంట్ సైడ్స్ మరియు డిఫరెంట్ ఎమోషన్స్ తో ఈ ఫొటోలో చూపించాను.
ఛాలెంజ్ స్వీకరించిన తాను ఆమె ఛాలెంజ్లో పేర్కొన్నట్లుగా తన బాడీని డిఫరెంట్ డిఫరెంట్ గా చూపించానంటూ చెప్పింది.చాలా వేరియేషన్స్ను ఒకే ఫొటోలో చూపించడం అనేది కష్టమే.
అయినా కూడా సమంత మాత్రం వాటన్నింటిని ఇందులో చూపించి తన ప్రతిభను చూపించింది.ఇదే సమయంలో తన గ్లామర్ ను కూడా కాస్త శృతి మించి చూపించింది.
ఈ ఏడాది పూర్తిగా సమంత సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంది.గత ఏడాది మంచి సినిమాలతో వచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం నిరాశ పర్చింది.వచ్చే ఏడాదిలో అయినా ఈమె సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయో చూడాలి.రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
నయనతారతో కలిసి ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేయాల్సి ఉంది.
వచ్చే ఏడాదిలో సమంత సందడి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.