ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం ఏ స్థాయిలో ఉందనేది రోజు మనకి తెలుస్తూనే ఉంది.ఊహించని విధంగా విరుచుకుపడుతున్న కరోనా ధాటికి ప్రాణాలు పండుటాకుల్లా రాలిపోతున్నాయి.
చిన్నా పెద్దా లేదు ఎవరినైనా అమాంతం మృత్యు కౌగిలిలోకి లాగేసుకుంటోంది ఈ మహమ్మారి.అయితే యావత్ ప్రపంచ వ్యాప్తంగా కంటే కూడా అమెరికాపై తీవ్ర ప్రభావాన్ని చూపిన కరోనా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది…అయితే
అమెరికా శాస్త్రవేత్తలు ఈ మహమ్మారి వైరస్ పై విశ్రుతమైన పరిశోధనలు చేపట్టిన తరువాత కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు.
ఈ విషయాలు నిజంగా మానవాళికి గుండెలు ఆగిపోయే వార్తేనని చెప్పడంలో సందేహం లేదు.కరోనా వైరస్ చాలా మందికి వచ్చిన తరువాత మళ్ళీ పరీక్షలు చేయించుకుంటే తగ్గుతోంది.
మందులు వాడుతున్నా సరే మళ్ళీ వస్తోంది.మళ్ళీ తగ్గుతోంది.
ఈ పరిస్థితులపై లోతైన అధ్యయనం చేశారు శాత్రవేత్తలు.ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి పై విస్తు గొలిపే నిజాలు తెలిపారు.
కరోనా నెగిటివ్ వస్తే శాశ్వతంగా శరీరం నుంచీ పోయినట్టుకాదట శరీరంలో అది నిద్రావస్థలో ఉంటుందని, మళ్ళీ అది ఎదురు దాడి చేయడంలో సందేహం లేదని అందుకే ఒక సారి తగ్గిన తరువాత మళ్ళీ రావడం జరుగుతుందని అంటున్నారు.ఎయిడ్స్, మిజీల్స్ రోగాల్లా ఇది కూడా శాశ్వతంగా శరీరంలో ఉంటుందని ప్రకటించారు.ఈ విషయాలని అమెరికాలో నార్త్ కరోలినా పరిశోధకుడు రేయాన్ మెక్ నమరా తెలిపారు.ప్రస్తుతం ఈయన చేసిన పరిశోధనలు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
.