కరోనా మహమ్మారి ఇక్కడ అక్కడ అన్న తేడా లేకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిపోతుంది.రోజు రోజుకు రాష్ట్రాల వ్యాప్తంగా కేసులు పెరుగుతూ పోతున్నాయి.
మరి ముఖ్యంగా కర్ణాటక లో ఈ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.మహారాష్ట్ర,తమిళనాడు,ఢిల్లీ ల తో పాటు కర్ణాటక లో కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.
అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో మరో పిడుగులాంటి వార్త బెంగుళూరు వాసులను భయాందోళనకు గురి చేస్తుంది.దాదాపు 3 వేల మందికి పైగా కరోనా సోకిన వ్యక్తుల ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే కేవలం ఒక్క బెంగుళూరు నగరంలోనే 27 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
మార్చి,ఏప్రిల్ నెలల్లో కేవలం 4 వందల నుంచి 5 వందల కేసుల మాత్రమే ఉన్న కర్ణాటక లో ప్రస్తుతం కేసుల సంఖ్య 85 వేలకు పైగా నమోదు అయ్యాయి.
అలానే మృతులు సంఖ్య కూడా వెయ్యి 7 వందలకు పైగా నమోదైంది.ఇలాంటి సమయంలో 3 వేలమందికి పైగా కరోనా సోకిన వారి ఆచూకీ కనపించకపోవడం తో అధికారులు వారి జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
రెండు వారల క్రితం బెంగుళూరు నగరంలో 16 వేలు మాత్రమే ఉండగా,ఇప్పుడు ఈ సంఖ్య 27 వేలకు పెరిగిపోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది.రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో సుమారు సగం బెంగుళూరులోని కేసులేనని అధికారులు చెబుతున్నారు.దీనికి ఇప్పుడు ఈ 3 వేలమంది కరోనా వ్యక్తులు ఆచూకీ లభించకపోవడం తో ఈ సంఖ్య ఇంకెంత పెరుగుతుందో అన్న అనుమానం అధికారుల్లో వ్యక్తం అవుతుంది.
కోవిడ్-19 రోగుల్లో కూడా చాలామంది పత్తా లేకుండా పోయారని,అనేకమంది తప్పుడు చిరునామాలు, తప్పుడు ఫోన్ నెంబర్లు ఇచ్చారని, వారి ఆచూకీ కనుగొనడానికి పోలీసుల సాయం తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు.అయితే ఇలాంటి వ్యక్తుల కారణంగా కరోనా వైరస్ మరింత వ్యాపిస్తుందని అధికారులు ఇప్పుడు ఈ పనిలో పడ్డారు.