కరోనా మహమ్మారి రోజు రోజుకు తన మనుగడను పెంచుకుంటూ పోతుంది.మొన్నటివరకు ముక్కు,నోరు ద్వారా శరీరంలోకి ఈ మహమ్మారి ప్రవేశిస్తుంది అని అందరూ భావించారు, అయితే ఇప్పుడు తాజా గా జరిపిన పరిశోధనల్లో నమ్మలేని నిజాలు వ్యక్తం అయ్యాయి.
ఈ మహమ్మారి కేవలం ముక్కు,నోరు ద్వారానే కాకుండా చెవుల నుంచి కూడా ఈ కరోనా వ్యాపిస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు.కరోనా సోకి మరణించిన రోగుల చెవుట్లో మస్టాయిడ్ లో ఈ వైరస్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించినట్లు తెలుస్తుంది.
దీనితో ఈ మహమ్మారి చెవుల ద్వారా కూడా సోకే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.అయితే అసలు ఈ వైరస్ మనిషి శరీరం లో నుంచి చెవుల్లోకి వెళుతుందా లేదంటే చెవుల నుంచే శరీరంలోకి ప్రవేశిస్తుందా అన్న అనుమానాలు మాత్రం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
అయితే దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిపి దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే నోరు,ముక్కు ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి నోటికి మాస్క్, ముఖానికి షీల్డ్ పెట్టుకొని తిరుగుతున్నారు.
ఇప్పుడు ఈ మహమ్మారి చెవుల నుంచి కూడా వ్యాపిస్తుంది అని నిపుణులు చెప్పడం తో ఇక జనాలు ఏమి ధరించి బయటకురావాల్సి పడుతుందో చూడాలి.
ఈ మహమ్మారికి ఎలాంటి మందు లేకపోవడం తో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కోటిన్నర కు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 6 లక్షల 40 వేల మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
రోజు రోజుకు ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ మహమ్మారికి ప్రతి ఒక్కరూ తమ తమ జాగ్రత్తల్లో ఉండాల్సిందే అంటూ పదే పదే హెచ్చరిస్తుంది.