విషాదం: రూ.45 వేలకు ఆడబిడ్డను అమ్మేసిన తండ్రి..!

తల్లి నవమాసాలు మోసిన బిడ్డను మరొకరికి 45వేల రూపాయలకు అమ్మేశాడు ఆ కన్నతండ్రి.అమ్మడు అని కసాయి తండ్రి అనుకోకండి.అతనికి కష్టం అలాంటి కష్టం వచ్చింది.బిడ్డను అమ్మాల్సిన అంత కష్టం ఎం వచ్చింది? అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.

 Poor Labourer, Father Sells, 15 Day Old Daughtr, Rs 45000, Lockdown Effect ,  As-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళ్తే.అసోంలోని కొక్రాజార్ జిల్లాలోని అటవీ గ్రామమైన ధంటోలా మాండరియాలో దీపక్ బ్రహ్మ నివసిస్తున్నాడు.

అయితే జీవనం కోసం గుజరాత్ కి వలస వెళ్లి అక్కడ కూలి పని చేసేవాడు.అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజుల కిందట స్వగ్రామానికి చేరుకున్నాడు.

అక్కడ పని దొరక్క భార్యాబిడ్డలను తీసుకొని అత్తగారింటికి వెళ్ళాడు.

కానీ అక్కడ కూడా పని దొరకలేదు.

భార్యాబిడ్డల కడుపు నింపడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన విఫలం అయ్యాయి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు.తన రెండో బిడ్డను అమ్మాలని నిర్ణయించుకున్నాడు.భార్యకు తెలియకుండా తన 15 రోజుల కుమార్తెను ఇద్దరు మహిళలకు రూ.45,000కు అమ్మేశాడు.

అయితే భార్య బిడ్డ ఏది అని ప్రశ్నించగా అమ్మేసినట్టు చెప్పగా షాక్ గురైన ఆమె తల్లితండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త దీపక్ నుండి వివరాలు సేకరించి ఆ ఇద్దరి మహిళలను పట్టుకున్నారు.

వారి వద్ద ఉన్న ఆ పసికందును రక్షించి క్షేమంగా తల్లి ఒడికి చేర్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube