స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతి బరిలో పోటీ పడిన సంగతి తెలిసిందే.మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బాక్సాఫీస్ను షేక్ చేయగా, బన్నీ అల వైకుంఠపురములో చిత్రంతో మైండ్ బ్లాక్ చేశాడు.
ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి విజేతలుగా నిలిచాయి.అయితే ఈ రెండు సినిమాల్లో దేనికి ఎక్కువ ప్రేక్షకాదరణ లభించిందనే ప్రశ్నకు ఖచ్చితంగా బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమాకే అని చెప్పాలి.
ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోల చిత్రాల్లో తేడా ఎక్కడ కనిపించిందనే అంశాలను పరిశీలిస్తే, కామెడీలో ఈ రెండు సినిమాల్లో చాలా తేడా కనిపించింది.ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు.
వారందరు కామెడీని పండించే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలోనే హీరో మహేష్ బాబు కూడా కామెడీ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూశాడు.
అయితే ఈ సినిమాలోని ట్రెయిన్ సీన్లో వచ్చే బండ్ల గణేష్ కామెడీ ఎపిసోడ్, రష్మిక చేసే ఓవర్ పర్ఫార్మెన్స్లతో పాటు మహేష్ చేసిన కామెడీ చాలా చిరాకు తెప్పించడంతో ప్రేక్షకులు నవ్వలేకపోయారు.
అటు బన్నీ సినిమాలో కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నా, బన్నీ టైమింగ్ ప్రకారం కామెడీ చేయడంతో ప్రేక్షకులు నవ్వుకున్నారు.
ఉన్న సీన్స్లోనే కామెడీ బాగా పండించాడు.ముఖ్యంగా మెలోడీ సాంగ్లో బన్నీ చేసే కామెడీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.ఇలా పరిమితమైన కామెడీతో నవ్వించిన బన్నీ సినిమా సక్సెస్ను తనదైన మార్క్తో లాక్కొచ్చాడు.అయితే కామెడీని ఓవర్గా చేసిన మహేష్ బాబు ప్రేక్షకులను నవ్వించడంలో ఫెయిల్ అయ్యాడు.
అందుకే కామెడీని కూడా అప్పుడప్పుడు సీరియస్గా తీసుకోవాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.