తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి స్టార్ మా లో సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమయ్యే “మౌన రాగం” సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో కొత్తగా చెప్పనవసరం లేదు.అయితే ఈ ధారావాహికలో హీరోయిన్ గా నటిస్తున్న అమ్ములు గురించి ఇప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
అయితే అమ్ములు అసలు పేరు ప్రియాంక జైన్. ఈ అమ్మడు ముంబైలో పుట్టి పెరిగింది.విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసింది.అయితే సినిమాల మీద ఆసక్తి కలగడంతో టాలీవుడ్ తెరకెక్కిన “చల్తే చల్తే” అనే చిత్రం ఆడిషన్స్ లో పాల్గొని హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.
అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కే ప్రదీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోక పోవడంతో ఈ అమ్మడికి సరైన గుర్తింపు రాలేదు.
అయితే ఆ తర్వాత తెలుగులో ఎవడు తక్కువ కాదు, వినరా సోదరా వీరకుమారా, తమిళంలో గోలీసోడా తదితర చిత్రాలలో నటించింది.అయితే ఈ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి.
దీంతో ఇక చేసేదేమీలేక ప్రియాంక జైన్ మౌన రాగం అనే సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఈ ధారావాహికలో ప్రియాంక జైన్ మాటలు రాని అమ్ములు అనే మూగ యువతి పాత్రలో నటించింది.
కానీ మాట్లాడలేకపోయినా తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.దీంతో సీరియల్ హీరోయిన్స్ కూడా అభిమానులు ఉంటారని ప్రియాంక జైన్ ప్రూవ్ చేసింది.
అయితేప్రియాంక జైన్ ప్రస్తుతం సీరియల్ నటిస్తూనే మరో పక్క సినీ అవకాశాల కోసం కూడా పట్టు విడవకుండా శ్రమిస్తోంది.