ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చినట్టుగా కరోన ఒక్కసారిగా ప్రపంచ దేశాలపై విరుచుకుపడటంతో ఏమి చేయాలో తెలియని దిక్కు తోచని పరిస్థితిలో పడిపోయాయి అన్ని దేశాలు.
అగ్ర రాజ్యం అమెరికా ఇప్పట్లో కోలుకునే పరిస్థితిలో కనపడటం లేదు దాదాపు అన్ని దేశాల పరిస్థితి ఇదే.అంతేకాదు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయిన దేశాలు ఇప్పుడు తమని తాము ఎలా చక్కదిద్దుకోవాలి అనే ఆలోచనలో పడ్డాయి.విదేశీ విద్యార్ధుల చదువులపై నీలి నీడలు అలుముకున్నాయి.అన్ని దేశాలు విదేశీ విద్యార్ధుల ఎంట్రీ లపై వారికి ఇచ్చే వీసాలపై ఆంక్షలు విధించాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఫ్రాన్సు దేశం మాత్రం విదేశీ విద్యార్ధులకి రెడ్ కార్పెట్ పరుస్తోంది.తాజాగా విదేశీ విద్యార్ధులకి ఆ దేశం భంపర్ ఆఫర్ ప్రకటించింది.
కరోనా ఉదృతి కొంత తగ్గుముఖం పట్టిన వెంటనే విదేశీ విద్యార్ధులకి వీసాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించింది.ఈ మేరకు ఫ్రాన్స్ రాయబారి ఓ ప్రకటన విడుదల చేశారు.
వెబ్ నార్ ద్వారా ఆన్ లైన్ లో జరిగిన ఫ్రాన్స్ ఉన్నత అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.
ఫ్రాన్స్ లో దాదాపు 10 వేల మంది విదేశీ విద్యార్ధులు విద్యని అభ్యసిస్తున్నారని అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఆన్ లైన్ లో క్లాసులు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు.ఎంతో ప్రతిభావంతులైన విదేశీ విద్యార్ధులని ఆకర్షించడానికే తాము త్వరలో వీసాల ప్రక్రియ ప్రారంభించనున్నామని.నిపుణుల కోసం ప్రత్యేకమైన కసరత్తులు చేపడుతామని ప్రకటించారు.