హైదరాబాద్లోని తార్నాకలో విషాదం చోటు చేసుకుంది.హైదరాబాద్ లో ఇఫ్లూ అసిస్టెంట్ ప్రొఫసర్గా పని చేస్తున్న రాహుల్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తూ తార్నాకలో జీవన సాగిస్తున్నాడు.రాహుల్ బుధవారం మధ్యాహ్నం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పూర్తీ వివరాల్లోకి వెళ్తే.
అయితే తెలంగాణాలో కరోనా విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసందే.
అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలియసందే.రాహుల్ స్వస్థలం విజయవాడ.
రాహుల్ కి వివాహం జరిగింది.కానీ వ్యక్తిగత కారణాల వలన భార్యతో విడాకులు తీసుకున్నారు.
దీంతో రాహుల్ ఒంటరిగా తార్నాకలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.అయితే రాహుల్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లకుండా తార్నకలో ఉండిపోయారు.
అయితే ఒంటరిగా ఉంటున్న రాహుల్ తార్నాకలోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే రాహుల్ ఆత్మహత్యపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.విషయం తెలుసుకున్న ఓయూ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు రాహుల్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.ఆత్మహత్య చేసుకొనేందుకు ఒంటరితనం వల్ల కలిగే ఒత్తిడి వంటివి కారణాలు అయి ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ కి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.