ఎట్టకేలకు భారతదేశ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.మార్చి నెలలో జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడుతూ చివరికి కరోనా వైరస్ నేపథ్యంలో ఐసీసీ వరల్డ్ కప్ 2020 రద్దు కావడంతో ఈ నేపథ్యంలో బీసీసీఐ యూఏఈలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించేందుకు శ్రీలంక, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, యూఏఈ దేశాలు ముగ్గు చూపినప్పటికీ చివరికి బిసిసిఐ ఐపీఎల్ యూఏఈ దేశంలో నిర్వహించాలని నిర్ధారించుకోండి.
ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలుపుతూ… ఈ సంవత్సరం టోర్నమెంట్ నిర్వహిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను షెడ్యూల్ వివరాలను అధికారికంగా అతి త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.ఇందుకోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని బీసీసీఐ అనుమతి కోరిందని తెలియజేశాడు.
ఇందుకోసం ఐపిఎల్ లో ఆడే క్రికెటర్లు అబుదాబి లేదా షార్జాలో క్యాంప్ నిర్వహణతో పాటు విదేశీ క్రికెటర్ల వీసా లకు సంబంధించి బీసీసీఐ ప్రణాళిక చేస్తుందని తెలిపారు.
ఇక ఐపీఎల్ లో ఆడే విదేశీ ఆటగాళ్లను నేరుగా యూఏఈ కి రప్పించడం, ఆ తర్వాత వారిని క్వారంటైన్ లో ఉంచి ఆదేశ రూల్స్ పాటిస్తూ మిగతా అంశాలపై దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలియజేశారు.