టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి రాశి ఖన్నా.ఈ అమ్మడు ఓ వైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ పరంగా ప్రాముఖ్యత ఉన్న సినిమాలు ఎంపిక చేసుకుంటూ వస్తుంది.కుర్ర హీరోలతో ఎక్కువగా ప్రేమ కథ సినిమాలు చేస్తుంది.ఇదిలా ఉంటే టాలీవుడ్ లో హీరోయిన్స్ కాంపిటేషన్ లో ఈ భామ స్టార్ హీరోలతో ఛాన్స్ లు సొంతం చేసుకోకపోయినా చేతినిండా సినిమాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.
ప్రస్తుతం తమిళంలో ఈ అమ్మడు చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.అందులో అరణ్మణి సీక్వెల్ తో పాటు హీరో సూర్యకి జోడీగా ఒక సినిమాలో నటిస్తుంది.ఇదిలా ఉంటే రాశిఖన్నా కెరియర్ లో సుప్రీమ్ సినిమాలో చేసిన బెల్లం శ్రీదేవి పాత్ర ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఎస్సైగా ఆ సినిమాలో అమ్మడు మంచి కామెడీ పండించింది.
ఈ క్యారెక్టర్ వలన సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది.దీంతో బెల్లం శ్రీదేవిగా తెలుగులో అందరికి సుపరిచితం అయిపోయారు.
ఇదిలా ఉంటే మరోసారి రాశి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.అయితే అది కామెడీ రోల్ కాదని, సీరియస్ గా నడిచే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ అమ్మడు సందడి చేయనున్నట్లు తెలుస్తుంది.
తమిళంలో శింబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి హీరోయిన్ గా చేస్తున్న అందులో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కొంత సేపు సండది చేస్తుందని టాక్ వినిపిస్తుంది.ఇందులో మరో కీలక పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా కనిపించబోతున్నాడు.