రోజు రోజుకీ విజృంభిస్తున్న మహమ్మారి వైరస్ అందరిని బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే.సామాన్య ప్రజలనే కాదు సెలబ్రిటీలను సైతం భయపెడుతుంది ఈ మహమ్మారి కరోనా వైరస్.
ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే.మహా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కరోనా కేసులు ఉండగా… కేవలం ముంబై నగరం లోనే అత్యధిక కేసులు ఉన్నాయి.
దీంతో మహారాష్ట్ర వాసులు అందరూ తీవ్ర భయాందోళన లోనే బతుకును వెళ్లదీస్తున్నారు.
కేవలం సామాన్య ప్రజలకే కాదు ఇటీవలే అమితాబచ్చన్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీ లకు సైతం కరోనా సోకడంతో అందరూ ఒక్కసారిగా అప్రమత్తం అయిన విషయం తెలిసిందే.
అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ లకు కరోనా రావటం సంచలనంగా మారింది.ఈ నేపథ్యంలో అలర్ట్ అయిపోయిన అందరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన ఇంటిని మన్నాట్ ప్లాస్టిక్ తో కప్పేశారు.షారుక్ ఖాన్ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోకి రాగా అవి కాస్తా వైరల్ గా మారిపోయాయి.
అయితే భారీ వర్షాల కారణంగానే ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తన ఇంటిని మొత్తం ప్లాస్టిక్ షీట్లతో కప్పి ఉంచుకుంటున్నారు అని కొంతమంది అంటే.కొంతమంది కరోనా వైరస్ కారణంగానే తన ఇంటిని మొత్తం ప్లాస్టిక్ కవర్ తో పూర్తిగా కవర్ చేశారు అని అంటున్నారు.
మరోవైపు షారుక్ ఖాన్ ఇలా తన ఇంటిని ప్లాస్టిక్ కవర్ తో కప్పి ఉంచడం ఇదే మొదటిసారి కాదని ప్రతి ఏడాది వర్షాకాలం సమయంలో తన ఇంటిని ఇలాగే ప్లాస్టిక్ తో కవర్ చేసి ఉంచుతారు అని మరికొంతమంది వాదనలు వినిపిస్తున్నారు.ఏది ఏమైనా కవర్లతో కప్పి ఉన్న షారుక్ ఖాన్ ఇల్లు మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.