మామూలుగా ఏదైనా కేసు విచారణలో జాగిలాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంటాయి అన్న విషయం తెలిసిందే.ముఖ్యంగా వాసనతో ఏకంగా నేరస్థులను పసిగట్టడంలో జాగిలాల కు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ ఉంటారు, ఏ కేసులో అయినా పోలీసులు ముఖ్యంగా జాగిలాలు ఉపయోగిస్తూ ఉంటారు.
మామూలుగా జాగిలాలు కొన్ని కొన్ని సార్లు చేసే సాహసాలు అబ్బుర పరుస్తూనే ఉంటాయి.ఇక్కడ ఓ జాగిలం ఇలాంటిదే చేసింది.
ఏకంగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో నక్కి ఉన్న నేరస్తుడిని పట్టుకొని తన సత్తా ఏంటో చూపించింది జాగిలం .12 కిలోమీటర్ల వరకు పరిగెత్తి జాగిలం నేరస్తున్ని పట్టించిన ఘటన కర్ణాటకలో జరిగింది.బసవ పట్టణ ప్రాంతానికి చెందిన చంద్ర నాయక్ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చి హత్య చేసారు.ఈ కేసు విచారణలో 1.7 లక్షల అప్పు తీసుకున్న చేతన్ అనే వ్యక్తి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేసారు.అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు, ఇక పోలీసులు ఎంత వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో.
తుంగా అనే జాగిలాన్ని రంగంలోకి దింపారు.
హత్య జరిగిన ప్రాంతంలో వాసన చూసిన ఆ జాజలం 12 కిలోమీటర్ల వరకు పరుగులు తీసింది, ఓ ఇంటి దగ్గర ఆగింది.
అక్కడ పోలీసులు సోదాలు చేయగా దాక్కున్న హంతకుడు కనిపించాడు.అయితే ఇలాంటి హత్య కేసును ఛేదించడం లో తుంగా అనే జాగిలం ఎంతగానో నేర్పరి అని పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఇక ఈ జాగిలం పై అదనపు డిసిపి ప్రశంసల వర్షం కురిపించారు.