కరోనా భయం.. వర్షంలో వదిలేసిన వృద్ధురాలి మృతదేహం!

బంధాలేంటి… బంధుత్వాలేంటి.నేను బతికి ఉంటే చాలు… ఎవరు ఎటు పోతే నాకేంటి… అనే విధంగా మనిషిని మార్చేసింది కరోనా వైరస్.

 Corona Virus, Warangal District, Mgm Hospital, Casualty Ward, Dead Body, Muncipa-TeluguStop.com

పేగు తెంచుకుని పుట్టిన బంధాలను కూడా కరోనా వైరస్ రోడ్డున పడేలా చేస్తుంది.కరోనా వైరస్ సోకకుండానే మనస్థాపంతో చనిపోయే పరిస్థితులను తీసుకొస్తుంది ఈ రక్కసి వైరస్.

మనుషుల్లో దయ జాలి మానవత్వం అనేది పూర్తిగా నశించిపోతుంది.

కరోనా బారిన పడకుండా నేను బతికి ఉంటే చాలు ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు ప్రస్తుతం జనాలు.

వరంగల్ జిల్లాలో జరిగిన దారుణ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది.కరోనా మనుషులను ఎంత కఠినం గా మార్చింది అనేదానికి ఈ ఘటన నిదర్శనంగా మారింది.

అందరి హృదయాలను కలచివేస్తోంది.

ఎంజీఎం ఆస్పత్రిలో క్యాజువాలిటీ వార్డు ముందు మహిళ మృతదేహాన్ని వదిలి వెళ్లిపోయారు.

ఆ మహిళ మృతదేహాన్ని ఎవరూ పట్టించుకోకపోవటంతో గంటల పాటు ఆ మృతదేహం అక్కడే ఉండిపోయింది.వర్షంలో తడిచి ఎండకు ఎండి ఆ మృత దేహం అక్కడే ఉన్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.

ఆసుపత్రికి సిబ్బందికి ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోలేదు.చివరికి మున్సిపాలిటీ వారికి సమాచారం అందించడంతో వారు వచ్చి ఆ మృత దేహానికి దహన సంస్కారాలు నిర్వహించిన విషాద ఘటన ఓ సరికొత్త పాఠం నేర్పుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube