బంధాలేంటి… బంధుత్వాలేంటి.నేను బతికి ఉంటే చాలు… ఎవరు ఎటు పోతే నాకేంటి… అనే విధంగా మనిషిని మార్చేసింది కరోనా వైరస్.
పేగు తెంచుకుని పుట్టిన బంధాలను కూడా కరోనా వైరస్ రోడ్డున పడేలా చేస్తుంది.కరోనా వైరస్ సోకకుండానే మనస్థాపంతో చనిపోయే పరిస్థితులను తీసుకొస్తుంది ఈ రక్కసి వైరస్.
మనుషుల్లో దయ జాలి మానవత్వం అనేది పూర్తిగా నశించిపోతుంది.
కరోనా బారిన పడకుండా నేను బతికి ఉంటే చాలు ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు ప్రస్తుతం జనాలు.
వరంగల్ జిల్లాలో జరిగిన దారుణ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది.కరోనా మనుషులను ఎంత కఠినం గా మార్చింది అనేదానికి ఈ ఘటన నిదర్శనంగా మారింది.
అందరి హృదయాలను కలచివేస్తోంది.
ఎంజీఎం ఆస్పత్రిలో క్యాజువాలిటీ వార్డు ముందు మహిళ మృతదేహాన్ని వదిలి వెళ్లిపోయారు.
ఆ మహిళ మృతదేహాన్ని ఎవరూ పట్టించుకోకపోవటంతో గంటల పాటు ఆ మృతదేహం అక్కడే ఉండిపోయింది.వర్షంలో తడిచి ఎండకు ఎండి ఆ మృత దేహం అక్కడే ఉన్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
ఆసుపత్రికి సిబ్బందికి ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోలేదు.చివరికి మున్సిపాలిటీ వారికి సమాచారం అందించడంతో వారు వచ్చి ఆ మృత దేహానికి దహన సంస్కారాలు నిర్వహించిన విషాద ఘటన ఓ సరికొత్త పాఠం నేర్పుతుంది.