ఓ మహిళ పెళ్లి చేసుకుంది.భర్తతో మనస్పర్థలు వచ్చాయని విడిపోయింది.
ఆ తర్వాత మరొ వ్యక్తిని సహజీవనం చేసి అతడితో కూడా గొడవపడి మనస్తాపానికి చెందిన మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
పెళ్లి చేసుకుని భర్తతో మనస్పర్థలు రావడంతో 18 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పింది రుక్సానా.
ఆ తర్వాత దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి పరిచయమై అది కాస్త ప్రేమగా మారి అతడి లివింగ్ రిలేషన్ కొనసాగించింది.అతడితోనూ గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరేసుకుని మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
విజయవాడలోని అయ్యప్పనగర్ కు చెందిన కరీముల్లాతో 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.వీరికి ఇద్దరు పిల్లలు.భర్తతో విబేధాలు రావడంతో రుక్సానా ఏడాది కిందట పుట్టింటికి వచ్చేసింది.ఈ నేపథ్యంలో పోరంకి గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే ఎలక్ట్రీషియన్ తో పరిచయం ఏర్పడింది.
అతి ప్రేమగా మారడంతో దుర్గాప్రసాద్ తో గత 10 నెలలుగా సహజీవనం సాగిస్తోంది.రెండు నెలలుగా కానూరులో కలిసి ఉంటున్నారు.ఇటీవల వీళిద్దరి మధ్య తరచూ గొడవ వస్తున్నాయి.సోమవారం కూడా గొడవ జరగడంతో దుర్గాప్రసాద్ గొడవ అనంతరం పనికి వెళ్లిపోయాడు.
గొడవల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైనా రుక్సానా ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఇది గమనించిన స్థానికులు ఇంట్లోకి చొరబడి ఆమెను కిందికి దించారు.
కానీ, ఆమె అప్పటికే మృతి చెందింది.దుర్గాప్రసాద్ వల్లే తన కూతురు ప్రాణాలు పోయాయని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.