తమిళ హీరోయిన్ వనిత విజయ్కుమార్ మూడవ పెళ్లి విషయం రచ్చ రచ్చ అవుతుంది.ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చిన ఆమె మూడవ పెళ్లి చేసుకోవడంను కొందరు తప్పుబడుతుంటే మరికొందరు మాత్రం ఆమెను సమర్ధిస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె మూడవ వివాహం చేసుకున్న వ్యక్తి తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు.దాంతో ఆ విషయంలో వనిత వివాదంలో చిక్కుకుంది.
ఒక మహిళ భర్తను నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అంటూ తమిళ సినీ రంగానికి చెందిన కొందరు ప్రశ్నిస్తున్నారు.అతడు విడాకులు తీసుకున్న తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుండేది అంటూ వనితను టార్గెట్ చేస్తున్నారు.
తాజగా ఒక ప్రముఖ ఛానెల్లో ఈ విషయమై చర్చ జరిగింది.లైవ్ లో చర్చ నిర్వహించిన లక్ష్మీ రామకృష్ణన్ మరియు వనితల మద్య మాటల యుద్దం జరిగింది.
నేను మూడవ పెళ్లి చేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటీ నీ చెత్త కార్యక్రమం రేటింగ్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేయి.నా పెళ్లి గురించి వివాదం వదిలేయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ సమయంలో లక్ష్మీ రామకృష్ణన్ లైవ్ నుండి వెళ్లి పోయేందుకు ప్రయత్నించింది.ఆ తర్వాత మళ్లీ రావడంతో ఇద్దరి మద్య చర్చ జరిగింది.
వనితపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సమయంలో లక్ష్మీ రామకృష్ణన్ ను వ్యక్తిగతంగా వనిత దూషించింది.నీవు ఒక్క భర్తతో సంసారం చేస్తున్నంత మాత్రాన నువ్వు పతివ్రతవు అనుకుంటున్నావా.నీ గురించి నాకు తెలియదా.నీ విషయాలన్నీ కూడా బయటకు తీస్తానంటూ హెచ్చరించింది.మొత్తానికి లైవ్ కార్యక్రమంలో వనిత మరియు లక్ష్మీల మద్య రసాబాస జరిగింది.