పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు పాతిక నుండి నలబై కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడు అనే టాక్ ఉంది.చాలా ఏళ్లుగా టాప్ పారితోషికంను పవన్ తీసుకుంటున్నాడు.
అయినా కూడా పవన్ ఆర్థిక సమస్యలతోనే ఉంటాడు.ఆయన ఆర్థిక సమస్యల కారణంగానే రేణు దేశాయ్తో విడాకులు తీసుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
మొత్తానికి పవన్ కళ్యాణ్ డబ్బుల విషయంలో ఇంట్రెస్ట్ చూపించక పోవడం వల్ల ఆయనకు ఆర్థిక ఇబ్బందులు ఉంటూనే ఉంటాయని ఆయన సన్నిహితుడిగా పేరున్న శరత్ మరార్ అన్నాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.
తనకు జానీ సమయంలో పవన్తో పరిచయం అయ్యింది.అల్లు అరవింద్ గారు జానీ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండాల్సిందిగా నన్ను కోరిన సమయంలో నేను ఒప్పుకున్నాను.
ఆ సమయంలో పవన్ గారితో సన్నిహిత్యం ఏర్పడినది.ఆయన ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులతోనే ఉంటారు.
తన వద్ద ఉన్న డబ్బును అస్సలు లెక్క చేయకుండా దాన ధర్మాలు చేయడం వల్లే ఆయన వద్ద ఎప్పుడు డబ్బు ఉండకుండా పోతుదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
పవన్ కళ్యాణ్తో తనకు విభేదాలు అంటూ కొన్నాళ్ల క్రితం ప్రచారం జరిగింది.కాని అదేమి లేదు.ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మా ఇద్దరి మద్య రాకపోకలు తగ్గాయి.
ఆ కారణంగానే మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు రాస్తున్నారు.మా ఇద్దరి మద్య ఇప్పటికి సన్నిహిత్యం ఉందని శరత్ మరార్ అన్నాడు.
పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత పరిస్థితి ఏంటీ అనేది మాత్రం తనకు క్లారిటీగా తెలియదని, కాని భవిష్యత్తులో ఆయన రాజకీయంగా మార్పు తీసుకు వస్తాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నాను అన్నాడు.