కరోనా కారణంగా థియేటర్లు అన్ని మూతపడటంతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రాధాన్యత పెరిగింది.ఈ నేపధ్యంలో ఒటీటీలకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
మళ్ళీ థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.ఈ కారణంగా చిన్న నిర్మాతల నుంచి పెద్ద నిర్మాతల వరకు అందరూ తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి ఒటీటీలానే ఆశ్రయిస్తున్నారు.
ఇక ఓటీటీ చానల్స్ కూడా సినిమాలకి ఉన్న డిమాండ్ బట్టి ఎంత రేటైన చెల్లించి వాటికి సంబందించిన రిలీజ్ రైట్స్ సొంతం చేసుకుంటున్నాయి.లక్ష్మి బాంబ్ సినిమాకి ఏకంగా రెండు వందల కోట్లు వరకు రైట్స్ రూపంలో చెల్లించినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ ఓటీటీ డిజిటల్ హవాలో నెట్ ఫ్లిక్స్ యూజర్స్ ని తనవైపుకి లాక్కోవడానికి అదిరిపోయే ఆఫర్ ని తీసుకొచ్చింది.
న్యూ ఓల్డ్ గార్డ్’ అనే గేమ్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ గేమ్ ఆది అత్యధిక పాయింట్లు స్కోరు చేసిన విజేతకు 1000 నెలల పాటు ఉచితంగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ అందిస్తామని ప్రకటించింది.సుమారు 83 ఏళ్ల పాటు ఎలాంటి చందా చెల్లించకుండా ఫ్రీగా నెట్ ఫ్లిక్స్ కంటెంట్ ను ఆస్వాదించవచ్చు.
ఈ ఆన్ లైన్ గేమ్ ఆడేముందు నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే ది ఓల్డ్ గార్డ్ అనే సినిమా చూస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందట.ఎందుకంటే, ఈ సినిమాలోని సన్నివేశాలే సదరు ఆన్ లైన్ గేమ్ కు ప్రాతిపదికగా వాడారని తెలుస్తుంది.
మరి నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇచ్చిన ఈ క్రేజీ ఆఫర్ ని ఉపయోగించుకొని ఎంత మంది గేమ్ ఆడటానికి ముందుకి వస్తారు అనేది వేచి చూడాలి.
.