మనం ఏదైనా ఇష్టం లేకుండా చేసుకోవచ్చు కానీ పెళ్లి మాత్రం ఇద్దరు ఇష్టంగానే చేసుకోవాలి.లేదంటే ఎన్నో సమస్యలు ఎదర్కోవాలి.
ఒకోసారి జీవితాలే నాశనం అవుతాయి.ఇంకా ఆల్పైన్ట్ ఘటనే గుజరాత్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.బనస్కాంత జిల్లా మన్గ్రోల్ గ్రామానికి చెందిన యువతికి తరాద్కి చెందిన వక్జీ పటేల్ అనే యువకుడితో రెండేళ్ల కిందట పెళ్లి అయ్యింది.
పెళ్లి జరిగి రెండు ఏళ్లు అయినప్పటికీ ఆమె పుట్టింట్లోనే ఎక్కువ ఉండేది.అప్పుడప్పుడు అత్తింటికి వెళ్లి వచ్చేది.దీనికి కారణంగా ఆమెకు ఇష్టం లేని వివాహం చెయ్యడమే.రెండేళ్లు అయినప్పటికీ ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు.
దీంతో గాంధీనగర్లో అద్దెకు ఇల్లు తీసుకొని ఆమెను పుట్టింటి నుండి బలవంతంగా తీసుకొచ్చి మార్చుకోవాలనుకున్నాడు.
భర్తను చంపాలని ప్లాన్ వేసింది.భర్త తినే భోజనంలో విషం కలిపి విషప్రయోగం చేసింది.అయితే విషం సరిగ్గా పనిచేయలేదని అనుమానించి భర్తను కత్తితో అతి దారుణంగా పొడిచి హత్య చేసింది.
అయితే ఈ విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి నర్బత్ పటేల్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.