మెగా హీరో సాయి ధరంతేజ్ వరుస హిట్ సినిమాలతో మళ్లీ జోష్ లోకి వస్తున్నాడు.కెరియర్లో ఏకంగా డబుల్ హాట్రిక్ డిజాస్టర్ లు కొట్టిన సాయి ధరమ్ తేజ్ మరల చిత్రలహరి, ప్రతి రోజు పండగే సినిమాలతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు.
ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఉంది.
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా కథ నేటి యువతరానికి దగ్గరగా ఉంటుందని తెలుస్తోంది.ఇదిలా ఉంటే సాయి ధరంతేజ్ తన నెక్స్ట్ సినిమాకి కూడా రెడీ అవుతున్నాడు.
కెరియర్లో ప్రస్థానం లాంటి అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరించిన దర్శకుడు దేవకట్టాతో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళుతున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కార్యక్రమం పూర్తి అయినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమా కథ నార్త్ ఇండియా నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది.
అలాగే సినిమాలో కథ పరంగా తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం.ఇక సినిమా కథ కథనం పూర్తిగా దేవకట్ట స్టైల్లోనే ఉంటాయని, అయితే మాస్ ఎలిమెంట్స్ తో పాటు కమర్షియల్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది.
కరోనా సిచువేషన్ తగ్గిన తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం.