కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎంత దారుణంగా నాశనం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం అంత వ్యాపించి అల్లకల్లోలం చేసింది.ఇంకా అలాంటి కరోనా వైరస్ మనకు రాకూడదు అంటే మనం ఎన్నో జాగ్రత్తలు పాటించాలి.
అలానే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవాలి.అప్పుడే కరోనా వైరస్ నుండి మనం తప్పించుకోగలం.
ఆ రోగోనిరోధక శక్తి పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.ఈ చిట్కాలు పాటించి కరోనా వైరస్ ను తరిమికొట్టండి.
- ప్రతిరోజు అరగంటసేపు యోగా, వ్యాయామాలు చేయాలి.
- బాగా వేడి చేసిన కప్పు పాలల్లో అరచెంచా పసుపు కలిపి తాగాలి.
- వేపాకులు, సాంబ్రాణి పొగను ఇంట్లో వేయాలి.
- జీర్ణశక్తిని పెంచే ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లిని వంటల్లో ఎక్కువగా వినియోగించాలి.
- వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం మంచిది.
అయితే అది కూడా తక్కువగానే తీసుకోవాలి.
- కప్పు నీటిని మరిగించి అందులో కాస్త మిరియాల పొడి, చిటికెడు లవంగాల పొడి, దాల్చినచెక్క పొడి వేసి చివర్లో తులసి ఆకులూ వేసి తాగాలి.
ఇది ప్రతిరోజు సాయంత్రం తాగితే మంచిది.
చూసారుగా ఈ చిట్కాలు పాటించి కరోనా వైరస్ ను తరిమికొట్టండి.