యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కి్స్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తరాక్ కొమురం భీం పాత్రల్లో నటిస్తున్నాడు.
కాగా ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమాను తారక్ కోసం పొలిటిక్ ఎంటర్టైనర్గా రూపొందించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమాకు అయినను పోయి రావలే హస్థినకు అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో తారక్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండనుండటంతో అంతే పవర్ఫుల్గా విలన్ పాత్రను కూడా తీర్చిదిద్దేందుకు త్రివిక్రమ్ సిద్ధమయ్యాడు.కాగా ఈ పాత్రలో యంగ్ హీరో మంచు మనోజ్ నటిస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
తాజాగా ఈ వార్తలపై మనోజ్ అండ్ టీమ్ స్పందించింది.మంచు హీరో ప్రస్తుతం విలన్ పాత్రల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని వారు తెలిపారు.
త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా అయితే ఖచ్చితంగా చేస్తానని, కానీ ఇప్పుడే విలన్ పాత్రలో మాత్రం నటించబోనని మనోజ్ క్లారిటీ ఇచ్చాడట.ఇక ఈ సినిమాలో తారక్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తాడని, ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.