విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.తమిళంలో సూపర్ సక్సెస్ అయిన అసురన్ చిత్రాన్ని తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమాలో వెంకీ సరసన హీరోయిన్గా ప్రియమణి నటిస్తోండటంతో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్కు కూడా మంచి రెస్పాన్స్ దక్కింది.కాగా ఈ సినిమాలో వెంకీ కొడుకుల పాత్రలు కూడా చాలా కీలకంగా మారనున్నాయి.
నారప్ప పెద్ద కొడుకు ముని కన్నా పాత్రలో యంగ్ నటుడు కార్తీక్ రత్నం నటిస్తున్నాడు.గతంలో కంచెరపాలం చిత్రంలో నటించిన కార్తీక్ రత్నం ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.
ఇప్పుడు నారప్ప లాంటి సూపర్ హిట్ రీమేక్లో ఈ నటుడు నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా తమిళంలో ఈ సినిమాను ధనుష్ తన నటనతో మరో లెవెల్కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.మరి ఈ సినిమాతో వెంకటేష్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అనే అంశం ఆసక్తిగా మారింది.
పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.