కరోనా వైరస్.ఎంతో ప్రశాంతంగా రొటీన్ గా సాగిపోతున్న ప్రజల జీవితంలోకి వచ్చి అల్లకల్లోలం సృష్టించిన వైరస్.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది.కేవలం ఆరు నెలల్లో కోటి 13 లక్షలమంది ఈ కరోనా భారిన పడ్డారు.
ఇంకా అందులో 60లక్షలమందికిపైగా ప్రజలు కోలుకోగా 5 లక్షలమందికిపైగా ఈ కరోనా వైరస్ కు బలయ్యారు.
ఇకపోతే ఈ కరోనా వైరస్ భారిన పడి చనిపోయిన వారి గురించి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
ఏంటి అంటే అంటే ఈ కరోనా భారిన పడిన వారిలో ఎక్కువశాతంమంది డి-విటమిన్ లోపం ఉన్నవారే అని.ఇంకా మృతుల్లో కూడా ఈ డి-విటమిన్ లోపం ఉన్నవారే ఎక్కువ మరణిస్తున్నారు అని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
ఇంకా సమృద్ధిగా డి-విటమిన్ ఉన్న వారికి కరోనా వచ్చినప్పటికీ వారి అతి తక్కువ సమయంలోనే కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకుంటున్నట్లు తేలింది.ఇంకా నగరవాసుల్లో దాదాపు 80 శాతం మందికి డి-విటమిన్ లోపం ఉంటుందని ఎన్నో సర్వేలు తేల్చి చెప్తున్నాయి.
అందుకే ఉదయం లేవగానే ఒక పదినిమిషాలు సూర్యకిరణాలు తగిలేలా చూసుకుంటే ఈ విటమిన్ డి లోపం తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.