సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చుట్టూ సమస్యలు, వివాదాలు ఉచ్చు బిగుస్తున్నాయి.ప్రతి ఒక్కరు సుశాంత్ మరణానికి కారణం అలియా భట్ తండ్రి మహేష్ భట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
వారి సినిమాలని బాయ్ కట్ చేయాలని ప్రచారం చేస్తున్నారు.ఇలాంటి సమయంలో మహేష్ భట్ ఫ్యామిలీ సినిమాగా సడక్ 2 పోస్టర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఈ సినిమాని బహిష్కరించాలని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉండగా, సినిమా పోస్టర్ హిందువుల మనోభావాలని దెబ్బ తీసే విధంగా ఓ వ్యక్తి ఏకంగా కేసు పెట్టాడు.దీనిపై చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరోయిన్ అలియా భట్ పై కేసు నమోదైంది.
సికందర్ పూర్ కు చెందిన ఆచార్య చంద్ర కిశోర్ పరాషర్ అనే వ్యక్తి అడ్వకేట్ సోను కుమార్ ద్వారా సడక్ 2 సినిమాపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.కేసు విచారణకు అంగీకరించిన చీష్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ముకేష్ కుమార్ జూలై 8న విచారణ జరుపుతామని వెల్లడించారు.
ఐసీసీ సెక్షన్ ల 295ఏ, 120బీ కేసును నమోదు చేశారు.సినిమాకు సంబంధించిన పోస్టర్లో కైలాస్ మానస సరోవర్ నుచూపించినందుకు ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.
మరి ఈ కేసుపై మహేష్ భట్ ఫ్యామిలీ ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.