భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో భారత సైన్యం, చైనా సైన్యంకి మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే.ఇందులో తెలంగాణకి చెందిన కమాండర్ సంతోష్ బాబు మృతి చెందారు.
ఈ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య
యుద్ధ వాతావరణం
నెలకొని ఉంది.రెండు దేశాలకి చెందిన సైన్యం సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున మొహరించి ఉన్నాయి.
ఇక ఇండియాలో చైనా ఉత్పత్తులు, చైనా యాప్స్ నిషేధించాలి అనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో సినిమాలకు సన్నాహాలు చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రముఖ మలయాళ దర్శకుడు, దేశ భక్తి సినిమాలు ఎక్కువగా తీసే మేజర్ రవి భారత-చైనా సరిహద్దు వివాదంపై బ్రిడ్జ్ ఆఫ్ గాల్వన్ పేరుతో ఒక చిత్రాన్ని తాజాగా ప్రకటించారు.ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించనున్నారు.
రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుంది.దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో సౌత్ నటులతో పాటు, బాలీవుడ్ నటులతో కలిపి తెరకెక్కించాలని భావిస్తున్నారు.ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ మేజర్ సంతోష్ బాబు పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.
సరిహద్దు వద్ద ఆర్మీ టీమ్ ని నడిపించిన సంతోష్ బాబు వీరోచితంగా పోరాడి వీర మరణం పొందారు.ఆ పాత్రలో మోహన్ లాల్ ని ఎంచుకున్నాడని చర్చ నడుస్తుంది.
అయితే దీనిపై అధికారిక ప్రకటన వస్తేగాని పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు.