టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సరే దానికి స్పెషాలిటీ కచ్చితంగా ఉంటుంది.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఏకంగా ఆన్ లైన్ ప్లాట్ ఫారంలో సినిమాలను విడుదల చేస్తూ కొత్త ట్రెండ్ ని సృష్టిస్తున్నాడు.
అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మదర్శకత్వం వహించిన “నగ్నం” అనే చిత్రాన్ని ఆన్ లైన్ ద్వారా విడుదల చేశాడు.
అయితే ఈ చిత్రాన్ని ఒక వర్గపు ప్రేక్షకులు బాగానే ఆస్వాదించినప్పటికీ రామ్ గోపాల్ వర్మ చిత్రాల్లో ఏదో ఉంటుందంటూ చూసే వారిని మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
దీంతో కొంతమంది సినీ క్రిటిక్స్ ఈ చిత్రంలో కథనం పెద్దగా లేకపోయినప్పటికీ హీరోయిన్ ప్రైవేట్ శరీర భాగాలు ఎక్కువగా చూపించడం మరియు శృంగార భరిత తరహా సన్నివేశాలు ఉండడం వల్ల వర్మ ఏదో అలా నెట్టుకొచ్చాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు నెటిజన్లు కూడా బి గ్రేడ్ సినిమాలు చూసేవారికి కచ్చితంగా నగ్నం చిత్రం బాగా నచ్చుతుందని, అంతేగాక రానురాను రాంగోపాల్ వర్మ బి గ్రేడ్ చిత్రాల దర్శకుడిగా మారిపోతున్నాడని అందుకు ఉదాహరణగా క్లైమాక్స్ మరియు నగ్నం చిత్రాలను చూపిస్తున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా కథలను రెడీ చేసుకొని వాటిపై దృష్టి సారి స్తున్నాడు.అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ గతంలో కులాంతర వివాహం చేసుకుందని ఓ వ్యక్తి తన కూతురి భర్తని కిరాయి గుండాల చేత హత్య చేయించిన సంఘటనపై తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
అంతేగాక ఈ చిత్రానికి మర్డర్ అనే టైటిల్ కూడా పెట్టాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు పోస్టర్లు కూడా విడుదల చేశాడు.