తెలుగులో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలకి ఉన్నటువంటి క్రేజీ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఈయన సినిమాలు టాక్ పరంగా డిజాస్టర్ అయినప్పటికీ దర్శక నిర్మాతలకు మాత్రం బాగానే కాసుల పంట పండిస్తున్నాయి.
అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించినటువంటి నగ్నం అనే చిత్రం ఆన్ లైన్ ద్వారా విడుదల చేశారు.
అయితే ఈ చిత్రాన్ని చూసేందుకు గాను ఇటీవలే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక్కొక్కరికి 200 రూపాయలు ముందుగా చెల్లించాలని టికెట్టు నిర్ణయించారు.
దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఒకే రోజులో దాదాపుగా 23000 పైచిలుకు మంది ఆన్ లైన్ ద్వారా సబ్ స్క్రైబ్ చేసుకున్నారు.దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రం మొదటి రోజు దాదాపుగా 47 లక్షల రూపాయల కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో ఆన్ లైన్ లో విడుదల చేయాలనే ఆర్జీవీ నిర్ణయానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ విషయంలో కూడా రామ్ గోపాల్ వర్మ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎప్పుడూ ట్రైలర్లు, పోస్టర్లు విడుదల చేస్తూ అమాంతం ఆసక్తిని పెంచేసాడు.
అందువల్లే ఆన్ లైన్ ద్వారా విడుదల చేసినా కూడా మంచి కలెక్షన్లు సాధించాడని కొందరు సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.