కల్లు తాగిన కోతి కుదురుగా ఉండదని పెద్దలు చెబితే ఊరికే అనుకున్నాం.కానీ అది నిజమని ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ కోతి నిరూపించింది.
మద్యానికి అలవాటు అయిన ఓ కోతిని జూ అధికారులు జైలులో బంధించి జీవిత ఖైదు కూడా చేశారు.ప్రపంచంలో ఇలాంటి సంఘటన జరిగి ఉండకపోవచ్చు.
కానీ మన దేశంలో జరిగింది.ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే….
ఆరు సంవత్సరాల క్రితం మిర్జాపూర్ జిల్లాలో పుట్టింది ఆ కోతి.దానిపేరు కల్వ.ఇక ఆ కోతిని పెంచుకుంటున్న ఓ వ్యక్తి దానికి మద్యం అలవాటు చేశాడు.దీనితో ఆ కోతికి మద్యం పూర్తిగా అలవాటు అయిపోయింది.
పూర్తిగా మద్యానికి బానిసైన ఆ కోతికి ఇప్పుడు మద్యం తెచ్చుకున్న పక్కనే కూర్చుని తాపించేవాడు ఆ వ్యక్తి.అంతేకాదు మంచింగ్ కోసం చిరు తిండ్లు కూడా అందించేవాడు.
ఇదంతా బాగా ఉన్న కొద్దిరోజులకి తనను చూసుకునే వ్యక్తి మరణించడం జరిగింది.ఇక దాంతో ఆ కోతికి మద్యం అందించే వారు లేరు.
మద్యానికి పూర్తిగా బానిసైన ఆ పెద్ద కోతి కి పూర్తిగా ఆరోగ్యం దెబ్బతింది.ఇక దాంతో ఆ కోతికి పూర్తిగా పిచ్చి పట్టినట్టుగా ఎవరు కనబడితే వారి మీద దాడి చేస్తూ కోపంతో ఆవేశంతో కొరకడం కొనసాగించింది.
దీనితో అటవీ అధికారులకు ఎంత ప్రయత్నం చేసిన చివరికి ఓ రోజు దొరికింది.అయితే ఆ సమయానికి జరగాల్సిన నష్టం జరిగింది.
అప్పటికే 250 మందికి ఆ కోతి కరవడం జరిగింది.తాజాగా అందులో ఒకరు మరణించడం కూడా జరిగింది.
ఇలా పట్టుకున్న కోతిని కొన్ని రోజుల పాటు ఒక ప్రత్యేక బోనులో ఉంచి దాని ప్రవర్తనలో మార్పు వచ్చిన తర్వాత దాన్ని బయటకు తీసి మిగితా కోతుల గుంపుతో ఉంచి చూశారు.కానీ బయటికి తీసిన తరువాత అదే కోపం, ఆవేశంతో ఉన్న దానిని చూసి మళ్ళీ ఓ ప్రత్యేక బోనులో బంధించారు.
ఇక ఆ జూ డైరెక్టర్ ఆ కోతి జీవిత కాలం అలాగే ఉంచుతామని తెలియజేశారు.