రోజు రోజుకి తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.గత పది రోజుల నుంచి కరోనా వైరస్ తీవ్రత మన తెలుగు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఎక్కువగా కొనసాగుతోంది.
ఇకపోతే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను బులిటెన్ ద్వారా విడుదల చేసింది.ఇందులో 15324 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 136 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
అంతేకాకుండా 72 మంది రాష్ట్ర మొత్తంమీద ఈ వ్యాధి నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయి వారి ఇంటికి చేరుకున్నారు.అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ బారినపడి ఒకరు మరణించడం జరిగింది.
ఇక వీరందరితో కలుపుకొని నేటితో రాష్ట్రంలో 4126 పాజిటివ్ కేసులు రాష్ట్రం మొత్తం మీద నమోదయ్యాయి.ఇక అలాగే 2415 మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి వారి ఇళ్లకు చేరుకున్నారు.
నేటి వరకు కరోనా వైరస్ బారినపడి రాష్ట్రవ్యాప్తంగా 78 మంది మరణించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1573 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక అలాగే రాష్ట్రం మొత్తంగా విదేశాల నుంచి వచ్చిన వారిలో 188 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.ప్రస్తుతం 170 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
అంతే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజల కారణంగా 933 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి.కాకపోతే అందులో 557 మంది కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి.
ఇక వీరిలో గత గడచిన 24 గంటల్లో 22 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.