తెలుగులో అక్కినేని హీరో సిసింద్రీ అఖిల్ హీరోగా నటించినటువంటి అఖిల్ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి ముంబై బ్యూటీ సాయేషా సైగల్ గురించి తెలియని వారుండరు.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఈ ప్రభావం సాయేషా తెలుగు సినీ కెరియర్ పై పడింది.దీంతో సాయేషా సైగల్ తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోలేకపోయింది.
కాగా తాజాగా ఈ అమ్మడు గురించి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వార్త ఏంటంటే సాయేషా సైగల్ తల్లి కాబోతుందని అందువల్లనే ప్రస్తుతం పలు చిత్ర షూటింగులకు దూరంగా ఉంటుందని కొన్ని వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.
కానీ తన గర్భం విషయంలో మాత్రం సాయేషా సైగల్ ఇప్పటివరకు స్పందించడం లేదు.దీంతో సాయేశ సాయేషా సైగల్ గర్భం దాల్చిందని వస్తున్నటువంటి వార్తలు నిజమేనా కాదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది మార్చి నెలలో తమిళ హీరో ఆర్య ని సాయేషా సైగల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం ఈ అమ్మడు టెడ్డీ అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
కాగా ఈ చిత్రంలో హీరోగా ఆర్య నటిస్తుండగా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటుడు సతీష్ నటిస్తున్నాడు.అలాగే ఇటీవలే కన్నడ భాషలో కూడా యువరత్న అనే చిత్రంలో నటించడానికి సయేషా సైగల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.