మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకోవాలని రవితేజ తెగ కష్టపడుతున్నాడు.
దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఈ సినిమా వస్తుండటతో క్రాక్ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ చూస్తే ఇదొక కాప్ థ్రిల్లర్గా తెరకెక్కిందనే విషయం అర్థమవుతోంది.
కాగా ఈ సినిమాలో రవితేజను ఢీకొట్టేందుకు ఒకరు కాదు ఇద్దరు విలన్లను పెట్టారు.తమిళ నటుడు సముతిరఖని మెయిన్ విలన్గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ రెండో విలన్గా నటిస్తోంది.
అయితే ఆమెది ఇందులో ఏదే మెయిన్ విలన్ చాటున చేసే చిన్న విలన్ పాత్ర కాదని తెలుస్తోంది.ఈ సినిమాలో రవితేజను ఢీకొట్టేందుకు మెయిన్ విలన్గా ఉంటుందట ఆమె పాత్ర.
తనదైన యాక్టింగ్తో ఈ సినిమాకు మరింత బూస్ట్ తీసుకొస్తుందట వరలక్ష్మీ శరత్ కూమార్ పాత్ర.
భీమవరం బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న ఈ కాప్ థ్రిల్లర్ మూవీలో రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.చాలా రోజుల తరువాత ఆమె ఈ సినిమాతో మళ్లీ కమ్బ్యాక్ ఇవ్వనుంది.
దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మాస్ ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి ఈ సినిమాతోనైనా రవితేజ మళ్లీ సక్సెస్ బాట పడతాడా లేడా అనేది చూడాలి.