దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఈ వైరస్ విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.
ఇప్పటి వరకు దీనికి సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో ముందు జాగ్రత్త చర్యలు ఒక్కటే ఆయుధంగా అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో మాస్క్ పెట్టుకోవడం, ఎప్పటి కప్పుడు శానిటైజర్తో చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పని సరి అని చెబుతుండడం తో చిన్నా,పెద్దా ప్రతి ఒక్కరూ కూడా ఆ నిబంధనలను పాటిస్తూ వస్తున్నారు.
అయితే చిన్నారుల విషయంలో సరికొత్తగా ఆందోళన మొదలైంది.ఎందుకంటే రెండేళ్ల లోపు చిన్నారులకు మాస్కులు అత్యంత ప్రమాదకరమని జపాన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
చిన్నపిల్లలు మాస్కులు ధరించడం వల్ల శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని సైంటిస్ట్ లు చెబుతున్నారు.
సాధారణంగా చిన్నారుల్లో శ్వాసమార్గం ఇరుకుగా ఉంటుందని అందుకే మాస్కు ధరించినప్పుడు గాలి పీల్చితే అది గుండెపై భారం పెంచుతుందని ఈ కారణంగా రెండేళ్ల లోపు చిన్నారులకు మాస్క్లు వేయకపోవటమే మంచిదంటూ వారు సూచిస్తున్నారు.