మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ‘అల వైకుంఠపురములో’ సినిమాను తెరకెక్కించి అదిరిపోయే బ్లాక్బస్టర్ హిట్ను అందుకున్నాడు.ఈ సినిమాతో త్రివిక్రమ్ నాన్-బాహుబలి రికార్డులను క్రియేట్ చేసి మరోసారి తన సత్తా చాటాడు.
కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి చేస్తున్నాడు.ఇప్పటికే ఎన్టీఆర్ 30వ చిత్రంగా ఈ సినిమాను అఫీషియల్గా కూడా లాంఛ్ చేశారు.
అయితే ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడటంతో త్రివిక్రమ్తో సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు.దీంతో త్రివిక్రమ్ ఈ గ్యాప్లోనే మరో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.
ఎప్పటినుండో ఓ మల్టీస్టారర్ మూవీని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్, ఇప్పుడు దాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.విక్టరీ వెంకటేష్, నేచురల్ స్టార్ నానిలతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ సిద్ధం అవుతున్నాడు.
ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన స్క్రిప్టు పనులు పూర్తి చేసే పనిలో ఉన్న త్రివిక్రమ్, ఒక్కసారి అది పూర్తవ్వగానే వెంకీ, నానిలకు కథను వినిపించేందుకు రెడీ అవుతున్నాడు.అయితే త్రివిక్రమ్తో ఈ మల్టీస్టారర్ మూవీ చేసేందుకు వెంకీ, నాని ఇద్దరు కూడా రెడీగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఈ సినిమాను అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.ఇక ఎన్టీఆర్తో చేయబోయే సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.