తమిళ నటుడు కార్తీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ‘ఖైధీ’ తమిళంతో పాటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్న కార్తీ, అదిరిపోయే బ్లాక్బస్టర్ను సొంతం చేసుకున్నాడు.
ఈ సినిమా కమర్షియల్గానూ విజయం సాధించడంతో ఈ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేస్తు్న్నారు.
ఇప్పటికే ఈ సినిమాను బాలీవుడ్లో హీరో అజయ్ దేవ్గన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి.
అయితే ఈ సినిమాను అజయ్ ఇప్పటికే అనౌన్స్ చేయడమే కాకుండా 2021 ఫిబ్రవరి 12న రిలీజ్ కూడా చేస్తానని చెప్పుకొచ్చాడు.కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యం అయ్యేలా లేదు.
కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ రెండు నెలలకు పైగా ఉండటంతో సినిమా రంగానికి చెందిన అన్ని పనులు కూడా ఆగిపోయాయి. దీంతో ఖైదీ రీమేక్ సినిమా కూడా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనే సందేహం సర్వత్రా నెలకొంది.
అయితే సినిమాలను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడంలో అజయ్ దేవ్గన్ స్పెషలిస్ట్.మరి ఖైదీ రీమేక్ చిత్రాన్ని చెప్పిన డేట్కే రిలీజ్ చేస్తాడా లేక వాయిదా వేస్తాడా అనేది ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తికరమైన అంశంగా మారింది.
ఇక ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్లో అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.