టాలీవుడ్లో బుల్లితెర నుండి వెండితెరపై ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే సక్సెస్ అందుకున్న వారు చాలా మంది ఉన్నారు.ఈ జాబితాలో తాజాగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు.ఇప్పటికే టాలీవుడ్లో యాంకర్గా చాలా పేరు సంపాదించుకున్న ప్రదీప్, ఇప్పుడు వెండితెరపై హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు.‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే ఆసక్తికరమైన టైటిల్తో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా ప్రదీప్ నటిస్తున్నాడు.
ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను మార్చి 31న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.కానీ కరోనా రూపంలో ప్రదీప్ అదృష్టానికి అడ్డంకి ఎదురైంది.
కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అమలులో ఉండటంతో ఈ సినిమాను నిరవధికంగా వాయిదా వేశారు.అయితే లాక్డౌన్ ఎత్తేయగానే ఈ సినిమాను రిలీజ్ చేద్దామని చూసిన ప్రదీప్ అండ్ టీమ్కు ఓటీటీల నుండి అదిరిపోయే ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
ప్రస్తుతం థియేటర్లు తెరుచుకునే సూచలను లేకపోవడంతో సినిమాలను నేరుగా డిజిటల్ ప్లాట్ఫాంలపై రిలీజ్ చేయాలని చూస్తున్నాయి చిత్ర వర్గాలు.ఈ క్రమంలో ప్రదీప్ సినిమాకు ఓటీటీల నుండి ఆసక్తికరమైన ఆఫర్లు వస్తుండటంతో తమ సినిమాను రిలీజ్ చేద్దామా వద్దా అనే డైలమాలో పడ్డారట చిత్ర యూనిట్.
తామె పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కవ మొత్తంలో ఆఫర్లు వస్తుండటంతో నిర్మాతలు సినిమాను డిజిటల్ రిలీజ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారట.మరి ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.