చలో సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.వరుసగా కమర్షియల్ హిట్స్ తో ఈ కన్నడ భామ దూసుకుపోతుంది.
ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఆడిపాడిన ఈ భామ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా కోసం రెడీ అవుతుంది.ఇక ఈ సినిమాలో ఇప్పటి వరకు చేయనటువంటి విభిన్న పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే రష్మిక క్లారిటీ ఇచ్చింది.
మరో వైపు కుర్ర హీరోలతో సినిమాలని కూడా లైన్ లో పెట్టడానికి రెడీ అయ్యింది.కమర్షియల్ హీరోయిన్ గా ఈ ఏడాది వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని రష్మిక మందన భావించింది.
ఇక వరుస కమర్షియల్ సినిమాలు చేయడం ద్వారా తన రెమ్యునరేషన్ కి రెండు కోట్లకి పెంచుకోవాలని రష్మిక ఆశపడింది.ఈ ఏడాది తర్వాత ఎలాగూ స్టార్ హీరోయిన్ రేంజ్ వస్తుంది కాబట్టి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్స్ జాబితాలో చేరాలని ఈ అమ్మడు కలలు కన్నది.
మరో వైపు వీలైనంత వరకు స్టార్ హీరోలతో జత కట్టాలని కూడా భావించింది.అయితే ఆమె ఆశలకి కరోనా పెద్ద బ్రేక్ డౌన్ అయ్యాయి.ఈ ఏడాది కేవలం ఆమె నుంచి భీష్మ సినిమా మాత్రమే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.పుష్ప సినిమా కూడా ఫినిష్ చేసే ఈ ఏడాది మొత్తం మూడు సినిమాలు కచ్చితంగా ఫినిష్ చేయాలని భావించింది.
అయితే ఈ లాక్ డౌన్ ఎప్పుడు క్లియర్ అవుతుందో, పుష్ప సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి.ఈ నేపధ్యంలో అత్యధిక రెమ్యునరేషన్ హీరోయిన్ కావాలనే తన కలకి ఈ కరోనా ఇబ్బందికరంగా మారిందని భావిస్తున్నట్లు తెలుస్తుంది.