నిర్మాత కొడుకు సినిమాకి అన్ని సిద్ధం చేసిన దర్శకుడు శ్రీవాస్

టాలీవుడ్ లో బడా నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి నిర్మాత డివివి దానయ్య.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా నిర్మాతగా మారిపోయాడు.

 Sri Vas Plan To Introduce Producer Dvv Danayya Son , Tollywood, Telugu Cinema, S-TeluguStop.com

ఈ సినిమా కోసం ఏకంగా మూడు వందల కోట్ల వరకు బడ్జెట్ ని దానయ్య పెడుతున్నాడు.ఇదిలా ఉంటే దానయ్య తన కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి చాల కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు.

తనయుడు కళ్యాణ్ ని మారుతి దర్శకత్వంలో హీరోగా పరిచయం చేయాలని అనుకున్నాడు.అయితే మారుతి అతనిని పరిచయం చేయడానికి ఆసక్తి చూపించలేదు.

దీంతో అతనిని దర్శకుడు శ్రీవాస్ కి హీరోగా నిలబెట్టే అవకాశం కల్పించారు.

ఇక దర్శకుడు శ్రీవాస్ చివరిగా సాక్ష్యం అనే సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ తో చేశాడు.

ఈ సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.ఇక కళ్యాణ్ తో తీయబోయే సినిమా కోసం కథని దర్శకుడు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఉప్పెన ఫేం కృతి శెట్టిని ఫైనల్ చేసినట్లు సమాచారం.అతిత్వరలోనే తనయుడి చిత్ర ప్రారంభోత్సవాన్ని చాలా గ్రాండ్‌గా దానయ్య ప్లాన్‌ చెయ్యబోతున్నట్టు తెలిసింది.

ఇక తనయుడుని కమర్షియల్ హీరోగా నిలబెట్టడానికి కావాల్సిన సబ్జెక్టుతోనే రాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.దీనికోసం భారీగానే బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తుంది.

లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఈ సినిమాని అధికారికంగా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube