ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్దం అవుతోంది.జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవరత్నాల హామీలు ఇచ్చిన విషయం తెల్సిందే.
ఆ హామీని నెరవేర్చేందుకు జగన్ ప్రభుత్వం అందుబాటులో ఉన్న భూములను వేలం పాట వేసేందుకు సిద్దం అవుతున్నారు.పెద్ద ఎత్తున హామీలు నెరవేర్చేందుకు భూములను అమ్మాలనే ఉద్దేశ్యంతో ఉన్న జగన్ అందుకు సంబంధించిన జీవోను ప్రకటించారు.
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆ భూముల ఖరీదు 210 కోట్లుగా నిర్ణయించారు.
గుంటూరు మరియు విశాఖ జిల్లాల్లోని పలు ఖరీదైన ఏరియాల్లో ఈ భూములను ఖరారు చేయడం జరిగింది.గుంటూరు జిల్లా నల్లపాడులో 6.7 ఎకరాల భూములు, శ్రీనగర్ కాలనీలోని 5.44 ఎకరాలు, మెయిన్ బీటీ రోడ్డు 1.72 ఎరకాలను వేలంకు సిద్దం చేశారు.ఇక విశాఖలో చిన్న గడీలో 1 ఎకరం, ఫకీర్ టకియా 1.04 ఎకరాలు, ఆగనం పూడి 50 సెంట్ల భూమిని వేలంకు రెడీ చేస్తున్నట్లుగా జీవో విడుదల చేశారు.ఈ అన్ని ఏరియాల్లో కూడా మార్కెట్ ధర భారీగా ఉంది.కనుక భారీ మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.