టాలీవుడ్లో తెరకెక్కిన బాహుబలి చిత్రం పాన్ ఇండియా మూవీగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.తెలుగు సినిమా స్థాయిని కేవలం సౌత్లోనే కాకుండా నార్త్ ఇండియాలోనూ దుమ్ములేపింది ఈ సినిమా.
ఇలాంటి ఫీట్ను మరో సౌత్ మూవీ కూడా సాధించింది.కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా భారీ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాతో కన్నడ హీరో యశ్ నేషనల్ హీరో అయిపోయాడు.
ఇక ఈ సినిమా సాధించిన భారీ విజయంతో దీనికి సీక్వెల్ను రెడీ చేస్తున్నారు చిత్ర యూనిట్.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం పూర్తి చేసుకోగా చిత్ర యూనిట్ ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని భావించారు.దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు.
కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా అన్ని రంగాలు స్తంభించిపోయాయి.ఈ క్రమంలో సినిమా రంగానికి చెందిన అన్ని పనులు కూడా నిలిచిపోయాయి.
ఇక సినిమా రిలీజ్ల విషయంలో ఇప్పట్లో ఎలాంటి దూకుడును ప్రదర్శించే అవకాశం కూడా లేకపోవడంతో భారీ సినిమాలు తమ రిలీజ్లను వాయిదా వేసుకున్నాయి.
ఈ క్రమంలో ‘కేజీఎఫ్ 2’ చిత్రం కూడా తమ రిలీజ్ను అక్టోబర్ నుండి వచ్చే ఏడాదికి వాయిదా వేసుకుంది.
దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దుతున్నాడు.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.