ఏంటి కోడి కూరలో ఉప్పు తక్కువైందని భార్యని ఏం చేశాడు? అని అనుకుంటున్నారా కదా.అక్కడికే వస్తున్నా.
కోడి కూరలో ఉప్పు తక్కువ వేసింది అని కోపం ఓ వ్యక్తి భార్యను అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన కర్ణాటకలో జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చేళూరుకు చెందిన బాలచంద్ర అనే వ్యక్తి ప్రైవేటు బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
ఇంకా అతను మధుర అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరి ఇద్దరికీ ఒక మగబిడ్డ కూడా ఉన్నాడు.ప్రస్తుతం ఆమె గర్భవతి.పుట్టింటికీ వెళ్లిన ఆమె లాక్ డౌన్ విధించడంతో అక్కడే ఉండిపోయింది.
దీంతో అతను భార్యని చూసేందుకు ఆదివారం మధ్యాహ్నం అత్తింటికి వచ్చాడు.
మద్యం తాగుతూ కోడి కూర వండాలి అని ఆమెకు చెప్పాడు.
దింతో ఆమె కోడి కూర వండి భర్తకు వండించింది.అయితే మద్యం మత్తులో ఉన్న బాలచంద్ర కూరలో ఉప్పు తక్కువై భార్యతో గొడవపడ్డాడు.
రాత్రి మరోసారి ఇదే విషయంపై గొడవ పడ్డాడు.మాట మాట పెరిగి ఆవేశంలో భార్య గొంతు నులిమి చంపేశాడు.
దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.