పేకాటలో భార్యని పణంగా పెట్టిన కలియుగ భర్త... చివరికి 

మహాభారతంలో ధర్మరాజు జూదం ఆడుతూ సర్వం కోల్పోయి చివరికి కట్టుకున్న భార్యని పందెంలో ఒడ్డిన సంగతి మనందరికీ తెలుసు.కానీ ఈ కాలంలో కూడా జూదానికి బానిస అయినటువంటి వ్యక్తి పేకాట ఆడుతూ డబ్బులు అయిపోవడంతో ఏకంగా భార్య శీలాన్ని పణంగా పెట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో వెలుగు చూసింది.

 Married Women, Kalyuga Husband, Playing Cards, Uttar Pradesh, Crime News-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి ఘజియాబాద్ పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు.

కాగా ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో ఎటువంటి పనులు లేక ఇంటి వద్దనే ఉంటున్నాడు.అయితే ఈ వ్యక్తికి అప్పుడప్పుడు జూదం ఆడే అలవాటు ఉండేది.

దీంతో తన స్నేహితులతో కలిసి ఇటీవలే తన ఇంటి వద్ద జూదం ఆడటం మొదలు పెట్టాడు.అయితే ఈ జూదంలో తన వద్ద ఉన్నటువంటి మొత్తం డబ్బు కోల్పోయాడు.

చివరికి తన భార్య శీలాన్ని పణంగా పెట్టి  జూదం ఆడగా మళ్ళీ పేకాటలో ఓడిపోయాడు.దీంతో తన స్నేహితుడు అనుకున్న విధంగా తన భార్యని తనకు అప్పగించాలని బలవంత పెట్టాడు.

దీంతో చేసేదేమీ లేక చివరికి తన భార్యని తన స్నేహితుడి దగ్గరికి వెళ్లి పొమ్మని సూచించాడు.ఈ విషయం విన్నటువంటి వ్యక్తి భార్య ఒక్కసారిగా ఖంగు తింది.

అంతేగాక ఈ విషయం గురించి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు భర్త మరియు జూదం ఆడినటువంటి స్నేహితులను అదుపులోకి తీసుకొని చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube