అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.అయితే గతంలో వరుస ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్న సమయంలో ప్రేమమ్ వంటి సినిమాతో అదిరిపోయే హిట్ను చైతూకు డైరెక్టర్ చందూ ముండేటి అందించాడు.
ఈ సినిమా అదిరిపోయే సక్సెస్ అందుకోవడంతో చైతూతో మరో సినిమాను తెరకెక్కించాడు చందూ ముండేటి.అయితే పూర్తి యాక్షన్ డ్రామాగా ‘సవ్యసాచి’ చిత్రాన్ని తెరకెక్కించాడు ఈ డైరెక్టర్.
కాగా ఈ సినిమాపై రిలీజ్కు ముందు మంచి అంచనాలే ఉన్నా, రిలీజ్ అయ్యాక మాత్రం బోల్తా కొట్టింది.ఈ సినిమా కథ కొత్తగా ఉన్నా కమర్షియల్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సినిమా పోయిందని చిత్ర దర్శకుడు చందూ ముండేటి తాజాగా తెలిపాడు.
ఈ సినిమా ఫెయిల్యూర్కు పూర్తి బాధ్యత తనదేనని చైతూకి చెప్పినట్లు, దానికి ఆయన ఎలాంటి నెగెటివిటీ చూపించలేదని అన్నాడు.ఇలా ఓ సినిమాను ఫెయిల్యూర్గా మలిచిన దర్శకుడితో తన స్నేహాన్ని కొనసాగించడం ఒక్క చైతూకే చెందిందని చందూ ముండేటి అన్నాడు.
ఇప్పటికీ తనకు చైతూతో మంచి స్నేహం ఉందని, ఇటీవల కార్తికేయ 2 చిత్ర టీజర్ రిలీజ్ చేసినప్పుడు తనకు బెస్ట విషెస్ కూడా చెప్పారని చందూ ముండేటి తెలిపాడు.ఇక ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్తో కలిసి కార్తికేయ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చందూ ముండేటి మరోసారి తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.