మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి అల వైకుంఠపురములో చిత్రాన్ని తెరకెక్కించి అదిరిపోయే సక్సెస్ను అందుకున్నాడు.ఈ సినిమాతో నాన్-బాహుబలి రికార్డును క్రియేట్ చేశాడు త్రివిక్రమ్.
ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్గా ప్రారంభించాడు త్రివిక్రమ్.
అయితే ఈ సినిమా విషయంలో వస్తున్న వార్తలకు త్రివిక్రమ్ అమ్మబాబోయ్ అంటున్నాడు.
ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ కారణంగా ఎన్టీఆర్ 30వ చిత్ర పనులకు బ్రేక్ పడిందని త్రివిక్రమ్ తెలిపాడు.
కాగా ఈ సినిమాపై సోషల్ మీడియా, పలు వెబ్సైట్లలో వస్తున్న వార్తలకు తన సన్నిహితులు అవాక్కవుతున్నారని, తనకు ఈ విషయంపై ఫోన్ చేసి వివరణలు అడుగుతున్నారని త్రివిక్రమ్ అన్నారు.ఈ సినిమాలో ఆ హీరో నటిస్తున్నాడా, ఆ హీరోయిన్ బాగుండదు, విలన్గా అతడు సరిపోడు అంటూ పలు రకాల వార్తలపై తన సన్నిహితులు ఆరా తీస్తుండటంతో తాను అవాక్కయ్యానంటూ త్రివిక్రమ్ అన్నాడు.
అసలు ఇలాంటి గాలి వార్తలు ఎలా పుడుతాయి, తమ సినిమా గురించి ఎవరూ నోరువిప్పకున్నా సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రేక్షకులు ఎందుకు రియాక్ట్ అవుతారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.ఇక తారక్ 30వ చిత్రంగా వస్తున్న సినిమాకు ‘అయినను పోయి రావలే హస్తినకు’ అనే టైటిల్ను పెట్టాలని చూస్తున్నాడట.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా త్రివిక్రమ్ ఎవరిని తీసుకుంటాడా అనే ఆసక్తిగా అందరిలో నెలకొంది.కాగా ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ చిన్నబాబు, ఎన్టీఆర్ ఆర్ట్స్పై నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.