టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల బ్యూటీగా మారిన పూజా హెగ్డే, ప్రస్తుతం తెలుగులో వరుసబెట్టి సినిమాలను తెరకెక్కిస్తోంది.ఇప్పటికే స్టార్ హీరోలతో నటిస్తున్న ఈ చిన్నది, అటు యంగ్ హీరోల చిత్రాల్లోనూ నటిస్తూ తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతోంది.
ఇక ఈ బ్యూటీ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ‘అల వైకుంఠపురములో’ అనే బ్లాక్బస్టర్ను అందుకుంది.ఈ సినిమాలో బన్నీ సరసన పూజా కాంబో అదిరిపోవడంతో ఫ్యాన్స్ ఈ జంటను పొగడ్తలతో ముంచెత్తారు.
ఇక ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా మిగతావారిలా ఈ బ్యూటీ కూడా ఇంటికే పరిమితం అయ్యింది.అయితే పలువురు సెలబ్రిటీలు తాము ఇళ్లలో ఏం చేస్తున్నారంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
కొందరు తాము చేస్తున్న వర్కవుట్లను, మరికొంతమంది వారు చేస్తున్న ఇంటి పనులు, వంట పనులను వీడియో చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.అయితే హీరోయిన్లు ఎక్కువగా వర్కవుట్ వీడియోలనే పోస్ట్ చేస్తుండటంతో పూజా కూడా తన వర్కవుట్ వీడియోను పోస్ట్ చేస్తారని అందరూ ఆసక్తిగా చూశారు.
కానీ తాను ప్రత్యేకించి ఎలాంటి వర్కవుట్ చేయనని, అందుకే వీడియోలు పోస్ట్ చేయనని పూజా అంటోంది.అయినా వర్కవుట్స్ చేయడంలో తానేమీ పెద్ద ఎక్స్పర్ట్ని కాదని చెప్పుకొచ్చింది.
దీంతో ఈ కామెంట్ ఇన్డైరెక్ట్గా టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ను ఉద్దేశించి అన్నది అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.టాలీవుడ్లో ఎక్కువగా వర్కవుట్ చేసే హీరోయిన్గా రకుల్ పేరొందింది.
ఇప్పుడు పూజా ఇలాంటి కామెంట్ చేయడంతో వర్కవుట్ విషయంలో రకుల్ ఒక్కతే ఎక్స్పర్ట్ అని, ఆమెకు సినిమా ఛాన్సులు లేకపోవడంతోనే ఇలా వర్కవుట్లపై దృష్టిపెట్టిందని పూజా సెటైర్ వేసిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.మరి ఈ అంశంపై రకుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.