తెలుగులో 1991వ సంవత్సరంలో సీనియర్ ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “ఆదిత్య369” చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘాన విజయాన్ని నమోదు చేయడమేగాక మంచి వసూళ్లను కూడా సాధించింది.
ఈ చిత్రంలో హీరోగా నందమూరి నటసింహం బాలకృష్ణ నటించగా హీరోయిన్ గా మోహిని నటించింది.అలాగే ఈ చిత్రంలో తరుణ్, సిల్క్ స్మిత, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
ఇప్పటికీ ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు మరియు పాటలు తెలుగు ప్రేక్షకులని బాగానే అలరిస్తున్నాయి.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.
అప్పట్లో ఈ చిత్రం తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ చిత్రం కావడంతో ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ప్రకటనల్లో మెగాస్టార్ చిరంజీవి ని నటించాలని కోరారట.అయితే బాలయ్య బాబు మరియు చిరంజీవి మధ్య ఉన్నటువంటి మైత్రి కారణంగా అందుకు మెగాస్టార్ చిరంజీవి వెంటనే ఓకే చెప్పాడట.
దీంతో ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ప్రమోషన్స్ యాడ్లలో మెగాస్టార్ చిరంజీవి నటించడంతో ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది.ఆ విధంగా బాలయ్య బాబు చిత్రానికి మెగా స్టార్ చిరంజీవి సాయం చేశారని పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ విషయం ఎలా ఉండగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన “మొదటి షెడ్యూల్ చిత్రీకరణ” పూర్తి అయినట్లు దర్శకుడు బోయపాటి శ్రీను గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు కూడా దాదాపుగా 45శాతం పూర్తయినట్లు సమాచారం.